Sunday, May 19, 2024
- Advertisement -

‘రంగ‌స్థ‌లం’ హీరోయిన్ విదేశాల్లో.. మ‌రీ ప్ర‌చారం ఎవ‌రు చేస్తారు

- Advertisement -

గ్రామీణ నేప‌థ్యంలో రూపొందించిన సినిమా… సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన సినిమా ‘రంగ‌స్థ‌లం’. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు రామ్‌చ‌ర‌ణ్ అంత స్థాయి హీరోయిన్ స‌మంత‌కు ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యి ప్రీ రిలీజ్ కార్య‌క్ర‌మం కూడా జ‌రిగింది. ఆ త‌ర్వాత ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు జ‌ర‌గాలి. ఈ మేర‌కు ఆ కార్య‌క్ర‌మాలు కూడా జ‌రుగుతున్నాయి. కాక‌పోతే ఈ సినిమాకు ఆ హీరోయిన్ మాత్రం రావ‌డం లేదు. ఎందుకంటే ఎంచ‌క్కా భ‌ర్త అక్కినేని నాగ‌చైత‌న్య‌తో క‌లిసి అమెరికా వెళ్లిపోయింది స‌మంత‌.

ప్ర‌స్తుతం ‘రంగ‌స్థ‌లం’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన‌సాగుతున్నాయి. వీటితో పాటు సినిమాను హిట్ పేరు తీసుకురావాలంటే బాగా ప్ర‌చారం చేయాలి. మ‌రీ ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు హీరో, హీరోయిన్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు హీరోయిన్ స‌మంత ఉండే అవ‌కాశం లేదు.

స‌మంత మహానటి సినిమాలో షూటింగ్ పూర్తి చేసుకుని భ‌ర్త‌తో క‌లిసి అమెరికాలో జ‌రిగే మియామి మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లింది. దీంతో ‘రంగ‌స్థ‌లం’ ప్రచార కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశం అస్స‌లు లేదు. అయితే ‘రంగ‌స్థ‌లం’ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు స‌మంత ముందే ఇచ్చేసింది. ఉగాది పండుగ సంద‌ర్భంగా అన్ని చాన‌ల్స్‌కు వెళ్లి ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ చేసింది. ఆ సంద‌ర్భంగా ‘రంగ‌స్థ‌లం’ సినిమా విశేషాలు అన్ని పంచేసుకుంది. చిట్టిబాబు, రామ‌ల‌క్ష్మి, సుకుమార్ త‌దిత‌రుల గురించి మొత్తం వివ‌రించింది. ఆ ఇంట‌ర్వ్యూల‌తో ‘రంగ‌స్థ‌లం’ సినిమాకు కావాల్సినంత ప్ర‌చారం ద‌క్కింది.మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో రూపొందించిన ‘రంగ‌స్థ‌లం’ సినిమా మార్చి 30వ తేదీన విడుద‌ల‌వుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -