Monday, April 29, 2024
- Advertisement -

ఆ ద‌ర్శ‌క-నిర్మాత‌ల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన స‌మంత‌

- Advertisement -

హీరోయిన్ స‌మంత నిత్యం త‌రుచు వాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిస్తుంది.తాజాగా ఆమె మ‌రోసారి హాట్ కామెంట్స్ చేసి మళ్లీ వార్త‌ల్లో నిలిచింది.ఈ నెల 13న ఆమె భ‌ర్త నాగ‌చైత‌న్య న‌టించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా విడుద‌ల కానుంది.అదే రోజున స‌మంత న‌టించిన యుట‌ర్న్ మూవీ కూడా విడుద‌ల కానుంది.భార్యాభర్తలిద్దరూ ఒకేసారి థియేటర్లోకి వచ్చి పోటీ పడనున్నారని సోషల్ మీడియాలో చెయ్ వర్సెస్ సామ్ అంటూ హ్యాష్ ట్యాగ్ లు ఇస్తున్నారు. . తాజాగా ఈ విషయంపై సమంత చేసిన కామెంట్స్ వివాదస్పదంగా అనిపిస్తున్నాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాతో తన సినిమా పోటీ పడడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని సమంత తేల్చి చెప్పింది.

ఈ విషయంపై దర్శకనిర్మాతలకు ఎంతగా చెప్పినా.. వారు మాత్రం తన మాట పెద్దగా పట్టించుకోలేదనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు.. ‘యూటర్న్’ దర్శకనిర్మాతలు సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావాలని, అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇలా చైతన్య సినిమాతో పోటీగా విడుదల చేస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మ‌రి ఎంతైనా భ‌ర్త‌తో పోటీ అంటే కొంచెం క‌ష్ట‌మే కాదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -