పల్లెటూరి నేపథ్యంలో.. మాస్ సినిమాగా రూపొందిస్తున్న‘రంగస్థలం’ సినిమాకు సమంత రాం రాం ప్రకటించేసింది. అంటే ఆమె పాత్ర షూటింగ్ పూర్తయ్యింది. రంగస్థలం షూటింగ్లో తనకు ఉన్న పాత్ర పూర్తవడంతో తన తర్వాతి సినిమాలతో బిజీగా అవనుంది. మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా సుకుమార్ రూపొందించిన రంగస్థలం సినిమా షూటింగ్ పూర్తయింది. షూటింగ్ అయిపోయిందోచ్ అంటూ శనివారం (ఫిబ్రవరి-3) ట్విట్టర్లో సమంత అక్కినేని ప్రకటించింది.
చిట్టిబాబు (రామ్చరణ్) పక్కన సమంత నటిస్తోంది. ‘రంగస్థలం సినిమా షూటింగ్ పూర్తయింది. రామ్చరణ్, సుకుమార్, మైత్రీ మూవీస్ వంటి స్పెషల్ టీంతో చేసిన స్పెషల్ జర్నీ ఇది. తమ స్టార్ హోదాకు తగ్గట్టు మనసు లోతుల్లోంచి వెలుగు పంచగల వ్యక్తులు వీరు. ఈ బిగ్బ్యాంగ్ కోసం ఇక వెయిట్ చేయలేకపోతున్నా’ అంటూ సమంత తన ఆనందం వెల్లిబుచ్చింది.