Thursday, March 28, 2024
- Advertisement -

బెల్లంకొండ ని అరెస్ట్ చేయబోతున్న పోలీసులు

- Advertisement -

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఒక ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి బెల్లంకొండ సురేష్ ఇవ్వాల్సిన 3.5 కోట్ల రూపాయలను ఇవ్వకపోవడం వల్ల కేసు నమోదైనట్లు సమాచారం. 2013లో బెల్లంకొండ సురేష్ సిద్ధార్థ మరియు సమంత హీరోహీరోయిన్లుగా ‘జబర్దస్త్’ సినిమాని నిర్మించారు. అయితే ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ ఢిల్లీ హైకోర్టు లో ఈ చిత్ర దర్శక నిర్మాతలు తమ ‘బ్యాండ్ బజా బరాత్’ సినిమా నుంచి పర్మిషన్ లేకుండా దాదాపు 19 సీన్లను ఉన్నది ఉన్నట్లు కాపీ చేశారని వారి ఆరోపణ. ఆ సమయంలో ఢిల్లీ హైకోర్టు ఆ సినిమాని థియేటర్లు మరియు టీవీ లో ప్రసారం చేయకూడదు అని తీర్పునిచ్చింది.

అయితే ఒక ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ జబర్దస్త్ సినిమా శాటిలైట్ రైట్స్ ను 3.5 కోట్లకు కొనుక్కుంది. కానీ కోర్టు తీర్పు నివ్వడం తీర్పు వల్ల ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానల్ వారు బెల్లంకొండ ను తమ డబ్బును తిరిగి చేయవలసిందిగా కోరుతున్నారు. కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ రావడంతో విసుగు చెందిన ఎంటర్టైన్మెంట్ చానల్ వారు ఆ 3.5 కోట్ల రూపాయలు వడ్డీతో సహా ఇప్పుడు 11.75 కోట్లకు చేరిందని ఎన్నిసార్లు అడిగినా బెల్లంకొండ సురేష్ తమ గోడును పట్టించుకోవడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అవడంతో కోర్టు ఆర్డర్ రాగానే పోలీసులు బెల్లంకొండ సురేష్ ని జైల్లో వేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -