Friday, May 17, 2024
- Advertisement -

రెండు పడవల ప్రయాణం చేస్తున్న సన్దీప్ కిషన్

- Advertisement -

సందీప్ కిషన్ కి తెలుగు లో వెంకటాద్రి ఎక్సప్రెస్ తర్వాత అంత పెద్ద విజయం దక్కలేదు మళ్ళి. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కానీ సందీప్ కిషన్ కి రావాల్సిన విజయం అందలేదు. ఇప్పుడు సందీప్ నటుడిగా, నిర్మాత గా రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.అయితే నిర్మాత గా మారి సినిమా చేస్తాను అని సందీప్ ఇప్పటి వరకు ఎప్పుడూ ఊహించి కూడా ఉండడు. ఇదే విషయాన్నీ ఆయన పలుమార్లు వ్యక్త పరిచిన విషయం మనకి తెలిసిందే. ఆయన నిర్మాణం లో మొదటగా వస్తున్న ఈ చిత్రం పేరు “నిను విడువని నీడను నేనే”

రెండు పడవల మీద ప్రయాణం ఎప్పుడూ కష్టమే కానీ సందీప్ మాత్రం ప్రాపర్ గా బాలెన్స్ చేస్తున్నాను అనే విశ్వాసాన్ని అందరికీ అందిస్తున్నాడు. కాకపోతే ఈ సినిమా విడుదల అయితే కానీ హీరో గా నిర్మాత గా ఈ కథ ని సందీప్ ఏ విధంగా జడ్జ్ చేయగలిగాడు అనే విషయం మనకి అర్ధం అవుతుంది. మిగిలిన వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -