Saturday, May 18, 2024
- Advertisement -

‘మ‌హాన‌టి’కి గొంతు అందించిన హీరోయిన్

- Advertisement -

బ్లాక్ అండ్ వైట్ కాలంలో ‘మ‌హాన‌టి’గా కీర్తి గ‌డించిన సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిస్తున్న సినిమా ‘మ‌హాన‌టి’. ఈ సినిమా కోసం పెద్ద పెద్ద న‌టీన‌టులు ప‌ని చేస్తున్నారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఈ సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్ యాడ‌య్యింది. అదే సీనియ‌ర్ న‌టి భానుప్రియ గొంతు అందిస్తోంది.

ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. అందుకోసం త‌మిళ్‌లో ఓ పాత్ర కోసం భానుప్రియ డబ్బింగ్ చెప్పనుందట. అయితే నడిగాయర్ పేరుతో గ్రేట్ యాక్టర్స్‌కు శ్రద్ధాంజలి అందించాలని ముందుగా ఆమెతో ఒక వాయిస్ ఓవర్ ఇప్పించనున్నారు. ఆ త‌ర్వాత ఈ డ‌బ్బింగ్ చెప్ప‌నున్నారు. దీనికి సంబంధించిన ఒక ఫొటో విడుద‌ల‌య్యింది. అది మ‌హాన‌టి సినిమా కోస‌మేన‌ని తెలుస్తోంది.

వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్, జెమిని గ‌ణేశ‌న్‌గా దుల్కర్ సల్మాన్, ఆ త‌ర్వాత ప‌లు పాత్ర‌ల్లో విజయ్ దేవరకొండ, సమంత, శాలిని పాండే, దర్శకులు క్రిష్ – తరుణ్ భాస్కర్, మోహన్ బాబు త‌దిత‌రులు న‌టించ‌నున్నారు. ఈ సినిమాను మే 9వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -