Friday, May 17, 2024
- Advertisement -

తొలి ల‌క్స్ పాప మ‌హాన‌టి

- Advertisement -
  • వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో మెరిసిన సావిత్రి

లక్స్ స‌బ్బు ఈనాటి కాదు. 1909 నుంచి ఈ స‌బ్బు ఉంది. ఈ స‌బ్బు కొత్త కొత్త మార్పుల‌తో వ‌స్తోంది. అయితే ఈ స‌బ్బు క‌న్నా ఈ స‌బ్బు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించిన వారు చాలా ఫేమ‌స‌య్యారు. ల‌క్స్ యాడ్ అంటే ప్ర‌జ‌ల‌కు ఎంతో ఆస‌క్తి ఉంటుంది. దానిక‌నుగుణంగా ల‌క్స్ యాడ్‌ల‌లో కొత్త కొత్త హీరోయిన్లు త‌మ అందాల‌ను చూపెడుతూ ఉంటారు. ఎన్ని స‌బ్బులు వ‌చ్చినా దీని ముందు ఏదీ సాటిరాదు. అలాంటి స‌బ్బుకు తొలి యాడ్‌లో న‌టించినది తెలుగు నుంచి మ‌హానటి సావిత్రిగారే.

ఈ స‌బ్బుకు తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా అప్పటి బాలీవుడ్ హీరోయిన్ లీలా ఛట్నీస్ ఉన్నారు. ఆ తరవాత హేమామాలిని, శ్రీదేవి, మధుబాల, మాధురీ దీక్షిత్, జూహీచావ్లా వంటి హీరోయిన్లు లక్స్ పాపలుగా ఓ వెలుగు వెలిగారు.

అయితే ఈ యాడ్‌లో తొలి తెలుగు న‌టి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో మహానటి సావిత్రి మెరిశారు. లక్స్ ప్రకటనలో బ్లాక్ అండ్ వైట్ లక్స్ సబ్బు డబ్బాపై సావిత్రి ఫొటో ఉంది. దాని కింద సావిత్రి గణేశ‌న్ అని పేరు ఉంది. ఇది 1960 కాలం నాటి మాట. ఈ ఫొటో ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో బాగా న‌డుస్తోంది.

ప్ర‌స్తుతం సావిత్రి సినిమా విడుద‌ల వ‌స్తుండ‌డంతో అంద‌రికీ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిన్న బుధ‌వారం ఈ సినిమా టైటిల్ మ‌హాన‌టి టీజ‌ర్ విడుద‌ల చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -