Saturday, May 18, 2024
- Advertisement -

కంచె సినిమా సీక్రెట్ చెప్పేశాడు

- Advertisement -

డైరెక్టర్ క్రిష్ తాను వరుణ్ తేజ్ తో కంచె చిత్రాన్ని ఎందుకు చేయాల్సి వచ్చిందో అసలు రహస్యాన్ని చెప్పేశాడు.

ఈ సినిమా  ఆడియో లాంచ్ ను ఈనెల  17 న జరపబోతున్న విషయం మనకు తెలిసిందే. అందుకే ప్రేక్షకులకు, మెగా ఫ్యాన్స్ ను అలర్ట్ చేయాలనే ఉద్దేశ్యంలో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో  క్రిష్ మాట్లాడుతూ… ‘వేదం సినిమా చిత్రీకరించేటప్పుడు  అల్లు అర్జున్ తో కలిసి విశాఖలోని ఒక మ్యుజియం ని చూడ్డానికి వెళ్ళాము. అక్కడికి వెళ్లాక ఒక విషయం తెలిసింది. 

జపనీస్ ఫోర్సెస్ … అక్కడ ఒక బాంబు ని  షిప్ లో పడేసారు.అదొచ్చి  2000 టన్నుల బరువున్న ఒక షిప్ లో పడిపోయిందనే సంగతి తెలుసుకున్నా. 

అలాగే   ‘వేదం సినిమా తమిళ్ లో రీమేక్ చేసే సందర్బంలో తమిళ్ నాడు  కరైకుడి మ్యుజియం లో రెండవ ప్రపంచ యుద్ధం లోని ఇండియన్ సోల్జర్స్ వివరాలున్నాయి. 25 లక్షల మందిలో దాదాపు 24,000 మంది చనిపోయారు. అది నన్ను ఎంతగానో కదిలించింది. ఇలాంటి సంఘటనలు గురించి తెలుసుకున్నాక ….అప్పుడు ఓ నిర్ణయానికి వచ్చాను.దాని రూపమే ఈ కంచె చిత్రమని కంచె చిత్రం ఎందుకు రూపొందాల్సి వచ్చిందో ప్రేక్షకులకు తెలియని ఆ సీక్రెట్ ను చెప్పేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -