- Advertisement -
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు-అశ్వీనిదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్,టీజర్కు విపరీతమైన స్పందన వచ్చింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.తాజాగా ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద కూడా కనిపించబోతుందని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ కి తల్లి పాత్రలో జయప్రద దర్శనమివ్వబోతుందని వినికిడి.హీరో అల్లరి నరేష్ సినిమాలో కీలక రోల్ చేస్తున్నాడు.మహేశ్ సరసన పూజా హెగ్డె హీరోయిన్గా నటిస్తుంది.ఇక ఈ సినిమా కోసం మహేశ్ ఫస్ట్ టైం ఫుల్ గెడ్డం ,మీసంతో పెంచాడు.ఈ సినిమా మహేశ్ కెరీర్లో 25వ సినిమా కావడం గమనర్హం.