Sunday, May 5, 2024
- Advertisement -

రీ ఎంట్రీ ఇస్తున్న మరో సీనియర్ నటి

- Advertisement -

మరో సీనియర్ నటి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. అప్పుడెప్పుడో తెలుగు ప్రేక్షకులను తన సినిమాలతో పలుకరించి..ఆ తర్వాత తెరకు దూరమైన నటి మాళవిక ఇప్పుడు కోలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించింది. 1999లో సుందర్‌.సి దర్శకత్వంలో అజిత్‌ హీరోగా ‘ఉన్నై తేడి’ ద్వారా కోలీవుడ్ కు పరిచమైంది. తర్వాత పలు సినిమాల్లో నటించింది.

తెలుగులోనూ కొన్ని మూవీస్ చేసింది. 2007లో సురేష్‌ మేనన్‌ తో పెళ్ళి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. తనను కోలీవుడ్ కు పరిచయం చేసిన సుందర్. సి దర్శకత్వంలోనే ఆమె రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాలో మంగమ్మ అనే పాత్ర పోషిస్తోంది. నటుడు, దర్శకుడు మనోబాలా ఈమెకు జోడీగా నటిస్తున్నారు.

జీవా, జై, శ్రీకాంత్ హీరోలుగా నటిస్తుండగా..అమృత అయ్యర్‌, రైజా విల్సన్‌, ఐశ్వర్య దత్తా కథానాయికలు. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న మాళవిక ఫోటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.

కొడితే సాంగ్ తో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ

పట్టుబట్టి ఆ డైరెక్టర్ ను మార్పించిన సమంత

బాయ్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ టాప్ హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -