నందమూరి హరికృష్ణ మరణంతో వారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.హరికృష్ణ ఓ పెళ్లి నిమిత్తం నెల్లురు వెళ్తుండగా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి మరణంతో షాక్ ఉన్నారు ఆయన ఇద్దరు కొడుకులు.తము ప్రాణంగా ప్రేమించే తండ్రిని కోల్పోయి ఇద్దరు అన్నదమ్ములు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.తండ్రి చనిపోయిన బాధ నుంచి వీరు కొలుకోవడానికి కొంత సమయం పడుతుందని అంతా భావించారు.
కాని తమ కారణంగా నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో రేపటినుండి వీరిద్దరూ తమ సినిమాల షూటింగ్ లలో పాల్గొనున్నారని సమాచారం.తమ ఇంట్లో సమస్యల కారణంగా షూటింగ్కు బ్రేక్ ఇవ్వకూడదని ఎన్టీఆర్,కల్యాణ్ రామ్లు ఇద్దరు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారట. నిర్ణయంతో అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు ఈ ఇద్దరు అన్నదమ్ములు. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ కోసం, కళ్యాణ్ రామ్ దర్శకుడు గుల్హన్ సినిమా కోసం సిద్ధమవుతున్నారని సమాచారం.