Friday, May 3, 2024
- Advertisement -

Official : సూపర్ హిట్ సైకో థ్రిల్లర్ మూవీ కి సీక్వెల్..!

- Advertisement -

రెండేళ్ల కిందట తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమా రాక్షసుడు విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. సైకో థ్రిల్లర్ కథాంశంతో తమిళంలో తెరకెక్కిన మూవీకి ఇది రీమేక్. తమిళంలో ఈ సినిమా విజయం సాధించగా తెలుగులో కూడా అంతే స్థాయిలో విజయం అందుకుంది. అప్పటివరకు సరైన సక్సెస్ లేని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచి మంచి పేరు తెచ్చిపెట్టింది.

శ్రీనివాస్ కెరీర్లో అల్లుడు శీను, జయ జానకి రామ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ బడ్జెట్ తో పోల్చి చూస్తే ఆ సినిమాలు విజయవంతం కాలేదు. కానీ రాక్షసుడు సినిమా శ్రీనివాస్ కు మొదటి హిట్ ఇచ్చింది. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. కోనేరు సత్యనారాయణ నిర్మించారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందని ఇవాళ ఆఫీసియల్ గా మేకర్స్ ప్రకటించారు.

ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో రాక్షసుడు -2 టైటిల్ తో పాటు షూటింగ్ బిగెన్స్ సూన్ అని మెన్షన్ చేశారు. రాక్షసుడు సినిమాకు దర్శకత్వం వహించిన రమేష్ వర్మనే సీక్వెల్ ని తెరకెక్కించనున్నారు. అయితే ఇందులో సాయి శ్రీనివాస్ హీరో కాదు. ఇందులో మరో తెలుగు అగ్రహీరో నటించనున్నట్లు టాక్. ప్రస్తుతం రమేష్ వర్మ రవితేజతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. అతిత్వరలోనే రమేష్ వర్మ రాక్షసుడు -2 సినిమాను ప్రారంభించనున్నారు. సీక్వెల్ ను కూడా కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -