బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడిగా వి.వి.వినాయక్ ను ఎంచుకున్నారు. ఛత్రపతి రీమేక్ షూటింగ్ ఇవాళ హైదరాబాద్లో ప్రారంభమైంది. మాతృకకు దర్శకత్వం వహించిన రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొని ముహూర్తపు షాట్ లో భాగంగా శ్రీనివాస్ పై క్లాప్ కొట్టారు. ఛత్రపతి సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా విడుదలయ్యి చాలా ఏళ్లు కావడంతో పాటు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ని దృష్టిలో పెట్టుకొని విజయేంద్రప్రసాద్ ఈ కథలో మార్పులు చేర్పులు చేశారు. ఛత్రపతి రీమేక్ ని భారీ బడ్జెట్ తో స్టూడియోస్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ది ఎవరు అనేది ఇంకా కన్ఫామ్ చేయలేదు.
కియారా అద్వానీ, అనన్య పాండే,కృతిసనన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా తెలుగులో శ్రీనివాస్ నటించిన తాజాగా చిత్రం అల్లుడు అదుర్స్. ఈ సినిమా తరువాత తెలుగులో మరో చిత్రాన్ని శ్రీనివాస్ ఒప్పుకోలేదు. ఛత్రపతి హిందీ రీమేక్ మాత్రమే చేస్తున్నారు. తెలుగులో సంచలన విజయం సాధించి ప్రభాస్ కు మాస్ ఇమేజ్ తెచ్చిన ఈ మూవీ.. బాలీవుడ్లో శ్రీనివాస్ కు ఎలాంటి పేరు తెస్తుందో చూడాలి.
Also Read
దసరా కాదు.. అంతకంటే ముందే అఖండ..!