తెలుగులో ఘనవిజయం సాధించిన ఛత్రపతిని హిందీలోకి రీమేక్ చేయబోతున్నారు. ఛత్రపతి తెలుగులో ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ ను తిరుగులేని మాస్ హీరో గా నిలబెట్టింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ డైరెక్టర్ రాజమౌళి కి కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో తెరకెక్కించబోతున్నారు. దీనికి వి.వి.వినాయక్ దర్శకుడు. ప్రముఖ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకంపై జయంత్లాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నిజానికి చాలా రోజుల క్రితమే ఈ రీమేక్ షూటింగ్ జరగాల్సింది. కానీ లాక్డౌన్తో ఆగిపోయింది. జూలై 16న అంటే రేపే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నట్టు టాక్. రాజమౌళితో పాటు ఏ ఎం రత్నం తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారట.
ఛత్రపతి తెలుగులో చాలా ఏళ్ల క్రితం విడుదలైంది. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో నిర్మిస్తుండటం.. చాలా ఏళ్లు గ్యాప్ రావడంతో కథలో కొన్ని మార్పులు చేస్తున్నారట. ఈ మార్పులను కూడా విజయేంద్ర ప్రసాదే దగ్గరుండి చూసుకుంటున్నారు. రాజమౌళి చేసే ప్రతి సినిమాకు విజయేంద్ర ప్రసాదే కథలను అందిస్తారన్న విషయం తెలిసిందే.
Also Read
అల్లు అర్హ బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ కన్ఫర్మ్.. అల్లు అర్జున్ ఎమోషనల్ ..!