గత సంవత్సరం రీలిజ్ అయిన అర్జున్ రెడ్డి టాలీవుడ్లో పెను సంచలనమే సృష్టించింది. ఇప్పటికి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకొవచ్చు. బుల్లెట్ బైక్స్కు మళ్లీ క్రేజ్ పెరిగిదంటే ఈ సినిమానే కారణం.ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండకు,దర్శకుడిగా సందీప్ రెడ్డికి మంచి పేరు వచ్చింది. సందీప్ రెడ్డికి ఏకంగా మహేష్తో చాన్స్ చేసే అవకాశం వచ్చింది.ఇప్పటికే తమిళంలో ఈ సినిమాను ‘వర్మ’ పేరుతో రీమేక్ చేస్తుండగా, ఇప్పుడు ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా పట్టాలెక్కే సమయం వచ్చినట్టుగా తెలుస్తోంది.
హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ విషయంలో పలువురు హీరోల పేర్లు వినిపించాయి. చివరగా షాహిద్ కపూర్ తో ఈ సినిమా పట్టాలెక్కుతోందని తెలుస్తోంది.మొదట ఈ సినిమా హీరో అర్జున్ కపూర్గా అనుకున్నారు. కాని అర్జున్ కపూర్ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో షాహిద్ కపూర్తో తెరకెక్కించాలని సందీప్ రెడ్డి అనుకున్నాడు. దీనికి షాహిద్ కపూర్ కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే ఈ షూటింగ్ మొదలు పెట్టాలని సందీప్ అనుకుంటున్నాడు.తమిళ రీమేక్ వెర్షన్ను జాతీయ అవార్డెడ్ దర్శకుడు బాల చేపట్టిన సంగతి తెలిసిందే.