Sunday, May 5, 2024
- Advertisement -

75 రోజుల షాలిని

- Advertisement -

ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్ హీరో హీరోయిన్లుగా షెరాజ్ దర్శకత్వంలో లయన్ సాయి వెంకట్ సమర్పణలో స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వి. సత్యనారాయణ నిర్మించిన “షాలిని” చిత్రం ఇటీవలే విడుదలై 75 రోజులు పూర్తీ చేసుకున్న సందర్బంగా హైద్రాబాద్ లో 75 రోజుల వేడుక హించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఆర్ కె గౌడ్, నిర్మాత సాయి వెంకట్, సీనియర్ నటి కవిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం .. సాయి వెంకట్ మాట్లాడుతూ .. షాలిని సినిమా విడుదలై 75 రోజులు పూర్తీ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఒక చిన్న సినిమా 75 రోజులు ఆడడం మాములు విషయం కాదు.

దర్శకుడు షెరాజ్ దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. ఈ రోజుల్లో చిన్న సినిమాలు విడుదల అవ్వడమే గగనం అవుతున్న సమయంలో ఓ చిన్న సినిమా ఏకంగా 75 రోజులు ఆడడం మాములు విషయం కాదు అన్నారు. దర్శకుడు షేరాజ్ మాట్లాడుతూ .. షాలిని చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మా నిర్మాత సత్యనారాయణ పెట్టుకున్న నమ్మకం నిజం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక చిన్న చిత్రానికి మీరు అందించిన సపోర్ట్ వల్లే ఇంత ఘానా విజయం దక్కింది. డిజిటల్ వ్యవస్థ వల్ల చిన్న సినిమాలకు పెద్ద దెబ్బగా మారె పరిసితి వచ్చిందని అన్నారు.

ఆర్కే గౌడ్ మాట్లాడుతూ . .. దర్శకుడు షెరాజ్ మంచి కథ కథనాలతో ఈ సినిమాను తెరకెక్కించాడు, ముక్యంగా ప్రమోషన్ విషయంలో అయన అవలంబించిన కొత్త విధానం ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించిందని అన్నారు. ఈ సందర్బంగా దర్శకుడు షెరాజ్ ను అభినందిస్తున్నాను అన్నారు. సీనియర్ నటి కవిత మాట్లాడుతూ .. షాలిని సినిమా విజయం చిన్న సినిమాలకు కొత్త ఉత్సహాన్ని ఇచ్చింది. సినిమా బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువు చేసారు ప్రేక్షకులు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -