Sunday, May 12, 2024
- Advertisement -

కిశోరుడు దర్శకత్వం లో శర్వానంద్

- Advertisement -

యువ కథానాయకుడు శర్వానంద్ ప్రస్తుతం రణరంగం అనే చిత్రానికి సంబందించిన ప్రచార పనుల్లో బిజీ గా గడుపుతున్నాడు. మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తర్వాత శర్వానంద్ 96 రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తి కావొస్తుంది. అయితే దీని తర్వాత ఎవరితో సినిమా చేయాలి అనే డైలమా లో శర్వానంద్ ఉన్నాడట. ఈ తరుణం లో నే ఒక లఘు చిత్రాల దర్శకుడు కిశోరుడు శర్వా కి కథ ని వినిపించాడట. శర్వానంద్ కి కథ బాగా నచ్చడం తో సినిమా చేస్తాను అని మాట ఇచ్చి ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడట.

అయితే సుజీత్ తర్వాత శర్వానంద్ మళ్ళి రెండో సారి ఒక లఘు చిత్రాల దర్శకుడికి అవకాశం ఇస్తూ ఉండటం విశేషం. శర్వా-సుజీత్ కాంబినేషన్ లో వచ్చిన రన్ రాజా రన్ పెద్ద విజయం సాధించింది. మరి ఈ సినిమా కూడా అంతే రేంజ్ లో విజయం సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఈ సినిమాకి సంబందించిన నిర్మాతలు, నటులు మరియు సాంకేతిక నిపుణుల గురించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -