Wednesday, May 8, 2024
- Advertisement -

మహేష్ త్రివిక్రమ్ సినిమాలో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

- Advertisement -

ప్రిన్స్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఇటీవలే తాజాగా వదిలిన ప్రోమో వీడియోతో అధికారికంగా ప్రకటించేశారు. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై “ఎస్ఎస్ఎమ్‌బీ28” అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు.త్రివిక్రమ్,మహేష్ వీరి కాంబినేషన్లో అతడు, ఖలేజా వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.మళ్లీ వీరి కాంబినేషన్ 11సంవత్సరాల తర్వాత హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమా విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి కీలక పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై త్రివిక్రమ్ ఆమెతో చర్చించగా,శిల్పాశెట్టి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అజ్ఞాతవాసిలో కుష్బూ, అల వైకుంఠపురములో’ టబు ఇలా త్రివిక్రమ్ సినిమాలో ఒక కీలకమైన లేడి పాత్ర ఉంటుంది. తాజాగా అటువంటి లేడీ పాత్రలోనే శిల్పాశెట్టి కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి తెలుగులో ఇదివరకే అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

Also read:స్టుపిడ్స్‌కు అలానే జరుగుతుంది.. వైరల్ గా మారిన రాశీ ఖన్నా పోస్ట్!

ప్రిన్స్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత, గీతగోవిందం మూవీ ఫేం పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ప్రిన్స్ సరసన బ్యూటీ క్వీన్ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఈ సినిమా షూటింగ్ నిలిపి వేసిన సంగతి తెలిసిందే.

Also read:ఆ సంఘటన చూసి షాక్.. మందుబాబుల పై సింగర్ సునీత షాకింగ్ రియాక్షన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -