Friday, April 19, 2024
- Advertisement -

ఆ సంఘటన చూసి షాక్.. మందుబాబుల పై సింగర్ సునీత షాకింగ్ రియాక్షన్

- Advertisement -

ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు ఆక్సిజన్ కొరత, వ్యాక్సిన్ పంపిణీ మొదలైన సమస్యలతో ప్రజలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి ఉన్నారు. వీరిని ఆదరించడానికి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు వారికి తోచిన విధంగా ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. ఇదే కోవలో టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తనకు చేతనైన పాటతో ప్రజా సేవ చేయడానికి సిద్ధమవుతోంది.

ప్రతీ రోజూ రాత్రి ఎనిమిది గంటలకు సింగర్ సునీత ఇంస్టాగ్రామ్ లైవ్లో అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులు అడిగిన పాటలను ఆలపిస్తూ మానసిక ప్రశాంతతను,ఉత్సాహాన్ని నింపుతున్నారు. సింగర్ సునీత ఎవరికీ చేతనైనా సాయం వారు చేయాలని కోరుతూ, తనకు తెలిసింది పాటలు పాడటమే కనక సునీత తనవంతుగా ప్రతి రోజు అరగంట పాటు లైవ్‌లోకి వచ్చి పాటలు పాడుతూ ప్రజల్లోఉత్సాహాన్ని నింపుతూ మానసిక ఒత్తిడిని దూరం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Also read:అవి చెబితే రాజమౌళి చంపేస్తాడు.. ఎన్టీఆర్ కామెంట్స్!

సునీత అభిమానులు అడిగిన పాటలు పాడటమే కాకుండా సమాజంలో జరిగే కొన్ని సంఘటనలపై కూడా ఆమె స్పందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై నిన్నటి లైవ్‌లో ఆమె స్పందించారు. లాక్‌డౌన్‌ అనగానే అందరూ నిత్యవసర సరుకులు, ఇతర సామాగ్రి కోసం షాపుల ముందు క్యూ కట్టడం సహజమే. అయితే వైన్‌ షాపుల ముందు జనాలు బారులు తీసి కనపడుతున్నారు. ఇంత నిర్లక్ష్యమా.లాక్‌డౌన్‌ వల్ల సమాజంలో కొంత మార్పు వస్తుందని అభిప్రాయపడ్డాను. కానీ ఈ సంఘన చూసి షాకయ్యా అంటూ ఆమె లైవ్‌లో వ్యాఖ్యానించారు.

Also read:ఎన్టీఆర్ కు కరోనా రావడానికి కారణం వాళ్లేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -