Friday, May 10, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో శ్రియ‌..!

- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, రానా, సుమంత్, నిత్యామీనన్, విద్యాబాలన్ ఇలా చాలా మంది నటీమణులు కనిపించనున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రియ కూడా ఈ సినిమా సెట్ లో జాయిన్ అయింది.అయితే సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ వచ్చింది. దర్శకుడు క్రిష్.. శ్రియపై ఓ పాటను చిత్రీకరించబోతున్నాడు. అసలు విషయంలోకి వస్తే.. ఎన్టీఆర్ కెరీర్ లో ‘దాన వీర శూర కర్ణ’ అనే సినిమా అతడికి ఎంతో ఖ్యాతిని తీసుకొచ్చింది.

ఈ సినిమాలో దుర్యోధనుడిపై ‘ఛాంగురే బంగారు రాజా’ అనే పాటను చిత్రీకరించారు. ఇప్పుడు బయోపిక్ లో కూడా ఆ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు ఆ పాటను చూపించనున్నారు. పాత పాటలో ఎన్టీఆర్ తో కలిసి ఆడి పాడిన ప్రభ స్థానంలో ఇప్పుడు శ్రియని తీసుకున్నారు. బాలయ్య-శ్రియలపై ఈ పాటను చిత్రీకరించనున్నారు. గతంలో బాలయ్య, శ్రియ కలిసి ‘చెన్నకేశవ రెడ్డి’,’గౌతమీపుత్ర శాతకర్ణి’,’పైసా వసూల్’ వంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ జంట తెరపై కనిపించనుంది. మరి ఈ పాట తెరపై ఎలా ఉంటుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -