Saturday, May 18, 2024
- Advertisement -

బుల్లితెర‌పైకి శృతిహాస‌న్‌

- Advertisement -

క‌మ‌ల్ హాస‌న్ కూతురిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన శృతి హాస‌న్ త‌క్కువ కాలంలోనే తాను ఏంటో నిరుపించుకుని ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌రుచుకుంది. త‌మిళ‌,తెలుగు,హిందీ భాష‌ల‌లో సినిమాలు చేసింది శృతి హాస‌న్. త‌రువాత కాలంలో ప్రేమ మోజులో వ‌చ్చిన సినిమాల‌ను వ‌దులుకుని ప్రేమికుడితో చెట్టాల్‌, ప‌ట్టాల్ వేసుకుని తిరిగింది.తీరా చూస్తే ఇప్పుడు బుల్లితెర‌పై ఓ షో చేస్తుంది. ఈ నెల 28 నుంచి శ్రుతిహాసన్‌ బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడానికి రెడీ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ వీడియో సేవలందిస్తున్న వైవ్‌ సంస్థ, మోషన్‌ కంటెంట్‌ గ్రూప్‌తో కలిసి వైవ్‌ హలో సాగో పేరుతో చర్చావేదిక కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. ఈ కార్యక్రమానికి సంచలన నటి శ్రుతిహాసన్‌ వ్యాఖ్యాతగా వ్వవహరిస్తున్నారు. తారలు తమ నిజ జీవితాల్లోని రహస్యాలను ప్రేక్షకులతో పంచుకుంటారని చెప్పారు.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటి శ్రుతిహాసన్‌ ఈ సందర్భంగా స్పందిస్తూ సాధారణంగా ఎంటర్‌టెయిన్‌మెంట్‌ రంగానికి చెందిన వారు వారి అంతరంగ విషయాల గురించి బయట ప్రపంచానికి చెప్పుకోవడానికి ఇష్టపడరన్నారు. అయితే ఈ వైవ్‌ హలో సాగో కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు తారల మరో ముఖాన్ని చూడగలరని చెప్పారు. 13 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ కార్యక్రమం ఈ నెల 28 నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు వైవ్‌ యాప్‌తో పాటు సన్‌ టీవీలోనూ ఏకకాలంలో ప్రసారం అవుతుందని నిర్వాహకులు వెల్లడించారు.శృతి హాస‌న్ తండ్రి కూడా బిగ‌బాస్ రియాల్టీ షోకి యాంక‌రింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -