- Advertisement -
అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ చిత్రంలో నటించి మెప్పించిన నటి శోభితా ధూళిపాల. ఇప్పుడు మేజర్ సినిమాలోనూ అవకాశం అందుకుంది. తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాలకు బాలీవుడ్ సినిమాలోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి.
తాజాగా ‘ది నైట్ మేనేజర్’ అనే సినిమాలో అవకాశం అందుకుందట. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించాలి.
అయితే, కారణాలు ఏమైనా గానీ.. ఆ రోల్ ఇప్పుడు ఆదిత్య రాయ్ కపూర్ చేస్తున్నారు. ఈ యంగ్ హీరో సరసనే శోభిత కలిసి నటిస్తోందట.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు