Friday, April 26, 2024
- Advertisement -

తన ఫోటోకి పాలాభిషేకం పై స్పందించిన సోను సూద్.. ఏమన్నారంటే?

- Advertisement -

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ కలియుగ కర్ణుడిగా, భరతమాత ముద్దుబిడ్డగా ప్రజల చేత కీర్తించబడుతున్న వ్యక్తి సోను సూద్.దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ విలయతాండవం చేస్తోంది.దానికి తోడు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండడంతో ఎంతోమంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవాల్సివస్తోంది. ఆక్సిజన్ కోసం ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చేందుకు సోనూసూద్ ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోను సోనూ సూద్ ఆక్సిజన్ ప్లాంట్లు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో సోను సూద్ అభిమానులు సోను చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాలాభిషేకం చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలోవైరల్ అవ్వడంతో తాజాగా సోనూ సూద్ ఈ వీడియోలపై స్పందించారు.

Also read:ఆచార్య నుంచి మరో సర్ ప్రైజ్ రెడీ చేసిన కొరటాల.. పెద్ద ప్లానే?

సోనూ సూద్ అభిమానులను ఉద్దేశించి ఈ విధంగా ట్వీట్ చేశాడు.మీరు చూపించే ప్రేమకు ఎంతో రుణపడి ఉన్నాను. పాలను అలా వృధా చేయడం నాకిష్టం లేదు.ఆ పాలను అవసరమైన వారికి ఇచ్చి మరింత సహాయ పడాల్సినదిగా కోరుచున్నాను అంటూ అభిమానులను కోరడంతో సోనూసూద్ వ్యక్తిత్వంపై పలువురు ప్రముఖులు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు.

Also read:పవన్ కళ్యాణ్ బర్త్ డేకి బిగ్ బిగ్ సర్ప్రైజ్.. ఏంటో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -