గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేరు ..బేబి.సరదాగా ఆమె పాడిన ఓ పాట ఇప్పుడు సంచలనంగా మారింది.మీడియాతో పాటు టాలీవుడ్ మొత్తం ఈ బేబి చూట్టునే తిరుగుతుంది.సంగీత దర్శకుడు కోటి ,మెగాస్టార్ చిరంజీవి,మురళీ మోహన్ , వంటి వారు ఈమెను ప్రత్యేకంగా కలుసుకుని ఆమె టాలెంట్ను అభినందించడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.దీంతో ఈ బేబి ఎవరు ? ఎందుకు ఇంత ఫేమస్ …అని చాలామంది వెతకడం మొదలుపెట్టారు.ఈ నేపథ్యంలో ఆద్యా మీడియా ఈ బేబి ఎవరు..ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఆమె పూర్తి పేరు పసల బేబీ సొంతూరు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలోని ఓ కుగ్రామం వడిశలేరు . ఈమె దినసరి కూలీగా పనిచేస్తూ పొట్టపోసుకుంటోంది. ఎవరో అమ్మాయి తప్పుగా పాడితే తట్టుకోలేక బేబీ తన గళాన్ని విప్పింది. ‘‘ఓ చెలియా నా ప్రియసఖియా’’ అంటూ పాడిన బేబీ గొంతుకు ఎక్కడలేని క్రేజీ వచ్చింది. ఈ వీడియోకి ఫేస్బుక్లో వేల లైకులు, షేర్లు దక్కగా కామెంట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. దాంతో కూనిరాగాలు మాత్రమే తీసే బేబీ ఇప్పుడు లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకొంది. సింగర్ బాలసుబ్రమణ్యం సైతం ఆమె గాత్రనికి ఫిదా అయ్యారు.తాజాగా ఆమెకు అస్కార్ అవార్డు గ్రహిత మ్యూజిక్ మెజిషన్ ఏఆర్ రెహామన్ సినిమాలో పాట పడే అవకాశం దక్కిందని సమాచారం.ఇదే కనుక నిజం అయితే బేబి నేషనల్ సింగర్గా మనం చూడవచ్చు.ఏది ఏమైనప్పటికి మట్టిలో మణిక్యంలా బేబి ఒక పల్లెటూరు నుంచి వెళ్లి ఈ స్థాయికి చేరుకోవడంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.