Friday, May 3, 2024
- Advertisement -

వ్యవసాయం నేపథ్యంలో ‘శ్రీకారం’ ఆకట్టుకుంటున్న ట్రైలర్!

- Advertisement -

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా ‘శ్రీకారం’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాకు కిశోర్‌ దర్శకత్వం వహించాడు. తాజాగా శుక్రవారం నాడు యువ హీరోలు నితిన్‌, నాని, వరుణ్‌ తేజ్‌ శ్రీకారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పలికే రిలీజైన పోస్టర్ లో రైతు పాత్రలో శర్వానంద్‌ ఆకట్టుకోగా… హీరోయిన్ ప్రియాంక గ్లామర్ కనువిందు చేస్తోంది.  రైతే రాజు అనే కాన్సెప్ట్‌తో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాను గుర్తుకు తెచ్చేలా మరోసారి శర్వానంద్ అదే ఫార్ములా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

తాజాగా ఈ  సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో శర్వానంద్ .. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఓనర్‌గా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఎందుకు వ్యవసాయం చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు ఉన్న సమిష్ఠి వ్యవసాయానికి రైతులు మరిలేలా ఎలా శ్రీకారం చుట్టాడనేది ఈ చిత్ర కథ. ఒక డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేస్తున్నాడు.. ఒక ఇంజనీర్ తన కొడుకును ఇంజనీర్ చేస్తున్నాడు.. కానీ ఒక రైతు మాత్రమే తన కొడుకును రైతు చేయడం లేదు.. మారాలి.. ఇది మారాలి.. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో శర్వానంద్ చెప్పిన డైలాగులతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు.

మిక్కీ జె.మేయర్‌ సంగీతం అలరించింది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం సమకూర్చిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ కాబోతోంది.

యువ బ్యాట్స్​మన్ శతకం.. ఎన్ని ఫోర్లు అంటే..!

సైనికుడు చనిపోయాడు.. కానీ వివరాలు వెల్లడి కాలేదు?

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -