Saturday, April 27, 2024
- Advertisement -

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

- Advertisement -

దాదాపు మూడేళ్ల పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇన్నేళ్లు ఇచ్చిన గ్యాప్ ను పూరించడానికి ఈ హీరో సెంకండ్ ఇన్నింగ్ ను కూడా స్టార్ట్ చేశాడు. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ పింక్ రీమేక్ మూవీ ‘వకీల్ సాబ్’సినిమాను తెరకెక్కించారు. ఇది మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మలయాళంలో సూపర్ హిట్‘అయ్యప్పనుమ్ కోషియం’చిత్రాన్ని రీమేక్ చేసే పనిలో పడ్డారు.

ఈ సినిమాలో పవన్ తో పాటుగా రానా దగ్గుపాటి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లు కుదిరినా.. పవన్ కు జోడీ మాత్రం దొరకడం లేదట. గత కొంతకాలంగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పవన్ సరసన నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ అమ్మడు ఇందులో నటించడం లేదంటూ క్లారిటీ వచ్చేసింది.

ఇక ఈ మధ్యన పవన్ సరసన ఐశ్వర్యరాజేష్ నటిస్తోందంటూ వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందంటూ సమాచారం. అ చిన్నదానికి కూడా డేట్స్ కుదరకపోవడంతోనే పవన్ సరసన నటించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఈ అమ్మడి విషయం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రైట్స్ 200 కోట్లు !

అయ్యయ్యో.. బాలయ్యకు ఏంటీ ఈ కష్టాలు !

అప్పుల్లో నాల్గో స్థానంలో ఏపీ

‘గజకేసరి’ గా దూసుకొస్తున్న యశ్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -