టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది.అయితే ఈసారి గొడవలతో కాకుండా సినిమాకు సంబంధించిన కబురుతో వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథను రెండు ,మూడు సినిమాలుగా తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు క్రిష్, బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటి కాగ,మరోకటి వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ప్రారంభించాడు .
అదే సమయంలో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే సినిమాను మొదలుపెట్టి అందులో లక్ష్మీపార్వతిగా ఐశ్వర్యారాయ్ ని తీసుకుంటానని సంచలన కామెంట్స్ చేశాడు. ‘లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీరెడ్డి నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశానికి ముందుకు జరిగిన అంశాలతో తాను సినిమా చేయబోతున్నట్లు కేతిరెడ్డి గతంలో ప్రకటించాడు.అయితే ఇప్పుడు శ్రీరెడ్డి టైటిల్ రోల్ పోషిస్తుందనే వార్త వివాదాలకు దారి తీసింది.అయితే లక్ష్మి పార్వతి పాత్రలో శ్రీరెడ్డి ఏమేరకు రాణిస్తుందో చూడాలి.