టాలీవుడ్ లో కేస్టింగ్ కౌచ్ భూతాన్ని ప్రపంచానికి తెలియజెప్పి సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి, హైదరాబాద్ ను వదిలి, ప్రస్తుతం చెన్నైలో మకాం వేసిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఏఆర్ మురుగదాస్, నటుడు లారెన్స్ వంటి ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి కలకలం సృష్టించింది. ఆ తరువాత కొంతకాలం సైలెంట్గా ఉన్న శ్రీరెడ్డి ఇటీవల వార్తల్లో నానుతోంది. సౌలెంట్గా ఉన్న శ్రీరెడ్డి తాజాగా మరో సారి వార్తల్లో కెక్కింది
నడిరోడ్డుపై బట్టలిప్పి అప్పట్లో చేసిన హంగామాకు రెట్టింపుగా హంగామా చేస్తూ ఏకంగా స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్ల పేర్లు బయటకు లాగి రచ్చ రచ్చ చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా డైరెక్టర్ తేజపై విరుచుకు పడ్డ ఈమె ప్రస్తం హీరో విశాల్ పై పడింది. ఇంకో వారం రోజుల్లో నడిగర్ సంఘం ఎన్నికలు జరుగనుండగా, బరిలో ఉన్న విశాల్, శరత్ కుమార్ ప్యానల్స్ మధ్య ఇప్పటికే విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతుండగా, తాజాగా, శ్రీరెడ్డి కూడా విమర్శలు చేయడం హాట్ టాఫిక్ గా మారింది.
అతని రాసలీలల తాలూకు వివరాలు తన వద్ద ఉన్నాయంటూ రచ్చ చేస్తోంది. ఈ మేరకు ”మిస్టర్ విశాల్ రెడ్డి.. నువ్ ఎలాంటి తప్పులు చేశావో నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి?? ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెమ్ వెన్నుమా?? ఇప్పిడి??” అంటూ విశాల్ పై ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి
విశాల్ తో నటించాలనుకున్న హీరోయిన్ ఆయన క్యారవాన్లో లైంగికంగా లొంగిపోక తప్పదని శ్రీ రెడ్డి పేర్కొంది. పచ్చి బూతులు మాట్లాడుతూ హీరో విశాల్ పై సంచలన ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి,