టాలీవుడ్ తాజా సంచలన నటి శ్రీరెడ్డి మరో వివాదానికి తెరలేపింది.టాలీవుడ్లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్పై తీవ్ర పోరాటం చేసింది శ్రీరెడ్డి.తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను లైగింకంగా వాడుకున్నాడని దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరాంపై ఆరోపణలు చేసింది ఈ భామ.తరువాత ఈ ఇష్యూ అనేక మలుపులు తిరిగి చివరికి పవన్ వద్దకు చేరడం,శ్రీరెడ్డి పవన్ను వాళ్ల అమ్మగారిపై అనుచిత వాఖ్యలు చేయడంతో ఇది వ్యక్తిగత సమస్యగా మారిపోయింది.
దీంతో అప్పటి వరకు శ్రీరెడ్డికి మద్దతు ఇచ్చిన వారు దూరంగా జరిగారు.గత కొంతకాలంగా శ్రీరెడ్డి ఎక్కడ కనిపించడం లేదు. మళ్లీ ఇన్నాళ్లుకు శ్రీరెడ్డి బయటికి వచ్చి 28మందిపై కేసు నమోదు చేసింది.వీరిలో ప్రముఖంగా జీవితారాజశేఖర్, బాబు గోగినేని,సినీనటులు.. ఆర్టిస్టులు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలపై మొత్తం 28 మంది మీద శ్రీరెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. మరి దీనిపై జీవితా రాజశేఖర్ తదితరులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.