అతిలోక సుందరి శ్రీదేవి కుతురు జాన్వీ కపూర్ దఢక్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమాపై మిశ్రమ స్పందన వస్తున్నప్పటికి, జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తొలి సినిమాలో జాన్వీ తన నటనతో ఆకట్టుకుందని అంటున్నారు. దఢక్ కలెక్షన్స్ పరంగా కూడా బాగానే ఉండటంతో నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే జాన్వీ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.నిజానికి జాన్వీ తెలుగు సినిమాతో అరంగేట్రం చేయలని భావించింది.
కాని మొదట తెలుగులో సినిమాలు చేస్తే బాలీవుడ్లో అవకాశాలు రావేమో అని భయపడి ఫస్ట్ బాలీవుడ్లో సినిమా చేసి తరువాత తెలుగులో సినిమాలు చేద్దాం అని ఫిక్స్ అయ్యారు బోనీ కపూర్ కుటుంబం.తాజాగా ఆమెను తెలుగులో ఓ స్టార్ హీరో పక్కన జాన్వీని హీరోయిన్గా తీసుకోవలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు.ఇప్పటికే ఆ దిశగా దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.మరి జాన్వీ ఏ హీరో పక్కన హీరోయిన్గా నటిస్తుందో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
https://www.youtube.com/watch?v=6SRTDD15uDg