Monday, April 29, 2024
- Advertisement -

సుధీర్ నా బావ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్.. ఎవరంటే?

- Advertisement -

తెలుగు బుల్లితెరపై కామెడీ షో లకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇప్పటికీజబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి కార్యక్రమాలు భారీ సక్సెస్ సాధించాయి. అలాగే ప్రముఖ టెలివిజన్ లో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షోకి ఈ మధ్య మంచి హైప్ వచ్చింది. ఇందులో జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ కంటెస్టెంట్లు, టీం లీడర్లు రంగంలోకి దిగడంతో ఈ షోకి మరింత ఆదరణ పెరిగింది.

ఇక ఈ షోలో గ్లామర్ మెరుగులు దిద్దడానికి ప్రముఖ హాట్ యాంకర్ శ్రీముఖి కూడా రంగంలోకి దిగిందని చెప్పాలి. ఇక ఈ షోలో సుధీర్‌తో కలిసి సందడి చేయబోతుంది హాట్ బ్యూటీ శ్రీముఖి.ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1. 00 గంటలకు ప్రసారం అవుతున్న ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల చేయగా ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు సుధీర్, శ్రీముఖి.

Also read:ఆచార్య నుంచి మరో సర్ ప్రైజ్ రెడీ చేసిన కొరటాల.. పెద్ద ప్లానే?

ఇక ప్రోమో విషయానికొస్తే” ఓ రాములమ్మా.. రాములమ్మా”అంటూ ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. ఫ్యాక్షనిస్ట్ డాటర్‌గా పంచ్‌లతో రెచ్చిపోయింది. అలాగే సుధీర్ ను బావా అనడంతో స్టేజ్ మొత్తం నవ్వుల వర్షం కురిసింది. ఇక సుధీర్ తనదైన శైలిలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రెచ్చిపోయాడు.ఏదైనా శుభకార్యానికి వెళ్లి ప్రోగ్రామ్ అడిగి పెర్ఫామ్ చేయొచ్చు కదా అని ఇమ్మానుయేల్ అంటే మొన్న శుభకార్యానికే వెళ్లి స్టేజ్ ఇవ్వండి పెర్ఫామ్ చేస్తా అని అంటే కూడా కొట్టారు ఎందుకంటే శోభనం గదిలో స్టేజ్ ఉండదంట కదా అని అమాయకంగానే డబుల్ మీనింగ్ పంచ్ వేశాడు సుధీర్. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ ప్రోమోని మీరు వీక్షించండి.

Also read:ఆ ఫొటో చిరునవ్వులు తెప్పించింది: నమ్రత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -