- Advertisement -
తెలుగు పరిశ్రమకు మరో నట వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.అతగాడెవరో కాదు..మైటీస్టార్ శ్రీకాంత్ కుమారుడు రోషన్ .
ఇప్పటికే రుద్రమదేవి చిత్రంలో చాళుక్య వీరభద్రునిగా నటించిన ఈ కుర్రవాడు అతి త్వరలో సోలో హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. అయితే ఆ సినిమాను నిర్మించే భాద్యత కింగ్ నాగార్జున తీసుకున్నాడని తెలుస్తోంది.కథా చర్చలు కూడా పూర్తయిన ఈ ఫిలింలో కింగ్ నాగార్జున గెస్ట్ రోల్ పోషించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే పూర్తయిన ఈ చిత్రం స్క్రిప్ట్ బట్టి చూస్తే… ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో మొదలయ్యే ప్రేమను హైలెట్ గా చేసి కమర్శియల్ మెసేజ్ ఫుల్ చిత్రంగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. అఖిల్ చిత్రం రిలీజ్ అయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చన్నది పరిశ్రమ వర్గాల వాదన.