రాజమౌళి డైరెక్సన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలసిందే. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంత బడ్జెట్ ను కేటాయించారు?ఎలాంటి టైటిల్ పెట్టనున్నారు? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సినిమా మల్టీస్టార్ కి కొత్త నిర్వచనం ఇస్తుందని సినీ వర్గాల్లో టాక్. అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆగష్టు నుండి సినిమాకు సంభందించిన కాస్టింగ్ మొదలవుతుందని సమాచారం. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తీస్తున్న భారీ మల్టీస్టార్ ఫై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాకి ‘ఇద్దరూ ఇద్దరే’ అనే టైటిల్ ను రాజమౌళి పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు చేసే పాత్రలు సమానమైనవి ఎవ్వరికి తక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా రాజమౌళి వారి పాత్రలను తీర్చిదిద్దడం జరిగిందని సమాచారం.
ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. ఆగస్టు నుంచి నటీనటుల ఎంపికను మొదలెట్టి .. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళతారట. టైటిల్ విషయంలో అధికారికంగా ప్రకటించే వరుకు రూమర్స్ ను నమ్మలేము.