- Advertisement -
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తరువాత తెలుగులో భారీ మల్టీ స్టారర్కు తెర లేపాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఓ సినిమాను ప్లాన్ చేశాడు రాజమౌళి. ఈ సినిమాను ఈ నెల 11 తేదీన 11 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియోను కూడా వదలడంతో, అంతా ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. టైటిల్ ను ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారు? .. హీరోయిన్లుగా ఎవరిని తీసుకున్నారు? వంటి ప్రశ్నలు అందరిలోనూ తలెత్తాయి.
టైటిల్ సంగతి అటుంచితే, హీరోయిన్లు ఎవరనే విషయాన్ని మాత్రం ఈ సినిమా లాంచ్ రోజున ఎనౌన్స్ చేసేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వాళ్ల ఎంపిక పూర్తయిందనీ .. అందువలన 11వ తేదీన ఎనౌన్స్ చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు. హీరోయిన్స్ గా ఎవరు ఛాన్స్ కొట్టేశారో చూడాలి మరి.