స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో అతడి పేరు చాలా గట్టిగా వినిపించేది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న నాగేశ్వర్ రావుపై ఎన్నో కథలు.. సంఘటనలు వినిపిస్తున్నాయి. అతడి కథలను, జీవితాన్ని బాగా తెలుసుకున్న దర్శకుడు వంశీకృష్ణ ఓ సినిమా చేయాలని నిర్ణయానికి వచ్చాడు. దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్ర పని చేస్తున్నాడు.
స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత చరిత్రపై సినిమా చేయాలని దర్శకుడు వంశీకృష్ణ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. దర్శకుడు వంశీకృష్ణ గతంలో దొంగాట అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేశాడు. ఇక రెండో సినిమా భారీగా తీయాలనే ఉద్దేశంతో.. 1980 కాలంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న టైగర్ నాగేశ్వరరావుపై సినిమా చేయాలని ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడు.
దాదాపు స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకోగా సాయి మాధవ్ బుర్రతో బలమైన మాటలను అందించడానికి సిద్ధమవుతున్నారు. టైగర్ నాగేశ్వరరావు పాత్రలో దగ్గుబాటి రానా కనిపించబోతున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని జూన్లో సెట్స్పైకి సినిమాను తీసుకెళ్తారు.