తెలుగు స్టార్ డైరక్టర్ సుకుమార్ మనస్సు మళ్లీ చిన్న సినిమా వైపు మళ్లినట్లుంది.ఇంతకుముందు తన శిష్యుడు సూర్య ప్రతాప్ తెరకెక్కించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రానికి స్క్రిప్టు అందించడంతో పాటు తనే ఆ చిత్రాన్ని నిర్మించాడు సుకుమార్.రంగస్థలం హిట్తో మంచి జోష్లో ఉన్న సుకుమార్ తన తరువాత సినిమాను మహేశ్తో చేస్తున్నాడు.మహేశ్తో గతంలో 1 నేనొక్కిడినే సినిమా చేశాడు సుకుమార్.ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ కావడంతో ,ఈసారి ఎలాగైనా మహేశ్కు హిట్ ఇవ్వలని కసితో ఉన్న సుకుమార్.మహేశ్ ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు తన దగ్గర ఉన్న స్క్రీప్ట్తో ఓ చిన్న సినిమా తీసే ఆలోచనలో ఉన్నాడు సుకుమార్.ఈ చిత్రం కోసం కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు. 18-24 ఏళ్ల మధ్య వయసున్న తెలుగమ్మాయిని కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్న చిత్ర బృందం అందుకోసం ప్రకటన ఇచ్చింది. వచ్చే నెలలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. విశేషం ఏంటంటే ఈ చిత్రంతోనే సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడని తెలుస్తుంది.