Tuesday, May 14, 2024
- Advertisement -

మనసును కదిలిస్తున్న సన్నీలియోని ట్వీట్‌

- Advertisement -

దేశంలో అఘాయిత్యాల పర్వాలపై చర్చ కొనసాగుతున్న వేళ కథువా ఘటన మాత్రం ప్రతీ ఒక్కరినీ కదిలించి వేస్తోంది.‘దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది’ అంటూ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన అందర్నీ ఆవేదనకు, ఆగ్రహానికి గురి చేసింది. ఈ దారుణానికి పాల్పడిన వారిని ఉరి తీయాలంటూ నెటిజన్లు సైతం ట్వీట్లు చేశారు.ప్రముఖులంతా తమకు తోచిన రీతిలో ఘటనపై స్పందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి సన్నీ లియోన్‌ చేసిన ఓ ట్వీట్‌ కదిలించి వేస్తోంది. తన కూతురు నిషా కౌర్ ను ఒడిలో పెట్టుకుని ఓ ఫోటో దిగి.. ఓ సందేశంతో ఆమె ట్వీటర్‌లో పోస్ట్‌ చేసింది.

‘నా మనసు, శరీరం, ఆత్మ సాక్షిగా నీకు ప్రమాణం చేస్తున్నా.. ఈ ప్రపంచంలోని చెడు నుంచి నిన్ను రక్షించుకుంటానని. నా జీవితాన్ని నీ రక్షణ కోసం అంకితం చేస్తా. క్రూరుల నుంచి పిల్లలు సురక్షితంగా ఉండాలి. వారిని జాగ్రత్తగా సంరక్షికోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అంటూ ఓ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.స‌న్నీ ట్వీట్ చూసిన వారంద‌రికి మ‌న‌స్సు క‌లిచి వేసింది.ఆ ట్వీట్‌కు సానుకూలంగా స్పందన వస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -