సినిమా ఇండస్ట్రీలో కొంతమంది జనాలు అంతే.. అన్నీ బాగున్నట్టే…… అంతా బాగున్నట్టే ఉంటారు. కానీ అంతలోనే ఒకరి క్రేజ్ని క్యాష్ చేసుకోవాలన్న ఐడియాలు వేస్తారు. ఇప్పుడు బోయపాటితో కలిసి బాలయ్య వేసిన అలాంటి ఒక ఐడియాకు మహేష్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడని తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికంటే బాలయ్యకు రికార్డుల పిచ్చి ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒక్కసారి కూడా చిరంజీవి క్రేజ్ని దాటలేకపోయాడు బాలయ్య. ఇప్పుడు కూడా చిరంజీవి సైరా క్రేజ్ని మించి ఉండేలా ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నాడు బాలయ్య.
అయితే బాలయ్య ఒక్కడే సోలో హీరోగా నటిస్తే ఎప్పటికీ కూడా కలెక్షన్స్ కనీసం నలభై కోట్లు దాటే ఛాన్స్ కూడా లేదు. అందుకే తెలివిగా బోయపాటితో కలిసి మహేష్ని సీన్లోకి లాగాలని చూశాడు బాలకృష్ణ. బాలకృష్ణకు ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ మహేష్తో కలిసి మల్టీ స్టారర్ చేస్తే బాలయ్య సినిమాకు చిరంజీవి సినిమాలకంటే ఎక్కువ కలెక్షన్స్ రావడంతో పాటు 2019 ఎన్నికల్లో టిడిపికి కూడా హెల్ప్ అవుతుందని సలహా ఇచ్చారు. వెంటనే బాలయ్య కూడా బోయపాటికి చెప్పి బాలయ్య-మహేష్ల కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ స్క్రిప్ట్ కూడా రెడీ చేయించాడు. రీసెంట్గా మహేష్కి స్టోరీ నెరేషన్ కూడా ఇప్పించాడు. అయితే మహేష్ మాత్రం ఆ సినిమా చేయడానికి నో చెప్పి బాలయ్యకు షాక్ ఇచ్చాడు. మహేష్ బావ గల్లా జయదేవ్ రిక్వెస్ట్ చేసినప్పటికీ మహేష్ మాత్రం నో చెప్పాడట. రాజకీయాల కోసం కెరీర్ని త్యాగం చేయలేనని చెప్పాడట. బాలకృష్ణ-మహేష్బాబులతో మల్టీ స్టారర్ చేయబోతున్నానని మీడియాకు లీకులు ఇచ్చిన బోయపాటికి ఆ రకంగా దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు మహేష్. అలాగే చిరంజీవి కంటె ఎక్కువ కలెక్షన్స్……. ఈ తరం హీరోలలాగే 100 క్రోర్ క్లబ్లో చేరాలనుకున్న బాలయ్య ఆశలకు కూడా గండి కొట్టాడు మహేష్. అయినా నారా లోకేష్, చంద్రబాబులకు మరీ బెండ్ అవ్వకుండా కాస్త ఎన్టీఆర్ని దగ్గర చేసుకుని ఇదే మల్టీ స్టారర్ని ఎన్టీఆర్తో ప్లాన్ చేస్తే బాలయ్య ఆశ సులభంగా నెరవేరుతుందని నందమూరి కుటుంబ సభ్యులే అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ అయితే బాలయ్య మాటకు నో చెప్పే అవకాశం కూడా లేదు. కానీ నారా వారిని దాటి బాలయ్య నిర్ణయం తీసుకోగలడా? చూడాలి మరి.