- Advertisement -
హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తీసిన తొలి సినిమా ‘చి ల సౌ.సుశాంత్ .. రుహాని శర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాను అక్కినేని నాగర్జున తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించారు.ఇప్పటికే రీలిజ్ అయిన టీజర్ ఆకట్టుకోగ,తాజాగా ఈ సినిమా ట్రైలర్ను అక్కినేని నాగర్జున గారి చేతుల మీదుగా విడుదల చేశారు.పెళ్లి చేసుకోమంటూ హీరోని ఒకవైపున తల్లి .. మరో వైపున స్నేహితులు ఒత్తిడి చేస్తుంటారు.
దాంతో తనకి పెళ్లి ఇష్టం లేదంటూనే అతను ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తరువాత వాళ్లిద్దరి మధ్య చోటు చేసుకునే సరదాలు .. కలహాలతో కూడిన సన్నివేశాలతో ఈ ట్రైలర్ కొనసాగింది.టీజర్ ,ట్రైలర్ బాగుండంటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా వచ్చేనెల 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.