Thursday, May 16, 2024
- Advertisement -

సానుభూతి అవసరం లేదు- శ్వేతా బసు

- Advertisement -

కొత్తబంగారు లోకంతో మంచి నటిగా అనిపించుకుంది అందాల తారా శ్వేతా బసు ప్రసాద్. ఈ చిత్రంతో ఈ భామకు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. కానీ ఈ సినిమా తర్వాత శ్వేతా కు పెద్ద ఆఫర్స్ ఏమి రాలేకపోయాయి. వచ్చిన అవకాశాలు చిన్నవే… దాంతో కొన్ని చిన్న సినిమాలు చేసింది. కానీ కొత్తబంగారు లోకం తో వచ్చిన క్రేజ్ మరే సినిమాతో ఈ భామకు రాలేకపోయాయి. దాంతో ఈ భామకు ఆఫర్స్ కూడా చాలా తగ్గాయి. ఏమి చేయలేని పరిస్థితిలో 2014లో ఒక వ్యభిచార కేసులో ఇరుక్కుంది.

దాంతో శ్వేతా బసు ప్రసాద్ పేరు సంచలనం అయ్యింది. ప్రస్తుతం తెలుగు పరిశ్రమకు ఈ భామ దూరంగా ఉంది. హిందీ బుల్లితెర పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం చంద్ర నందిని అనే హిందీ టీవీ సీరీస్ లో నందిని అనే యువరాణి పాత్రలో శ్వేతా బసు కనిపించనుంది. ఈ సీరియల్ ప్రమోషన్ లో పాల్గొన్న ఆమెపై మీడియా నుంచి గత సంఘటనకు సంబందించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సమయంలో ఆ ప్రశ్నలపై స్పందించిన శ్వేత బసు… ఆ విషయాలపై మాట్లాడటానికి నిరాకరిస్తూనే – తనకు ఎలాంటి సానుభూతి అవసరం లేదని అన్నారు. ఈ చంద్రనందిని సీరియల్ ను ఏక్తాకపూర్ రూపొందిస్తున్నారు. జోధా అక్బర్ ఫేమ్ రజత్ తోకాస్ కీలకమైన పాత్ర చేస్తుండగా… శ్వేతా బసు కీ రోల్ ప్లే చేస్తుంది! శ్వేతా బసు ప్రసాద్ కు ఈ సీరియల్ తనకు మళ్లీ మంచి లైఫ్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది శ్వేతాబసు.

Related

  1. శ్వేతాబసు మళ్లీ కొత్త కథ మొదలెట్టింది!
  2. శ్రీకాకుళంలో సినీ నటి వ్యభిచారం!
  3. వర్మ హీరోయిన్ వ్యభిచారిణిగా మారింది!
  4. వ్యభిచారం లో పట్టుబడ్డ ఫేమస్ ఆర్టిస్ట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -