Wednesday, May 8, 2024
- Advertisement -

నెటిజ‌న్‌కు ఘాటు కౌంట‌ర్ ఇచ్చిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి

- Advertisement -

నటి తాప్సికి ఓ నెటిజన్‌ నుంచి చేదు అనుభవం ఎదురైంది. కానీ ఇందుకు ఆమె బాధపడకుండా దీటుగా కౌంట‌ర్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం తాప్సి ‘మన్మర్జియా’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా చిత్రీకరణలో భాగంగా తాప్సి, అనురాగ్‌ సరదాగా మాట్లాడుకుంటూ స్నాక్స్‌ తింటున్న ఫొటోను తాప్సి ట్వీట్‌ చేశారు.

దీనిని చూసిన హర్జోత్‌ సింగ్‌ అనే నెటిజన్‌ ఆమెను ఎద్దేవా చేస్తూ, ‘అసలు నిన్ను హీరోయిన్‌ ని చేసిందెవరు? నువ్వు చూడ్డానికి యావరేజ్‌ గా ఉంటావ్’ అంటూ వ్యాఖ్యానించాడు. దానికి ఏమాత్రం నొచ్చుకోని తాప్సీ ‘బహుశా వాళ్లు నా నటన చూసి అవకాశం ఇచ్చి ఉంటారు. యావరేజ్‌ గా ఉండటంలో తప్పేం లేదు కదా? ప్రపంచంలో ‘యావరేజ్’ అనేది అతిపెద్ద కేటగిరీ’ అంటూ దీటైన జావాబిచ్చి అతని నోరు మూయించింది

గతంలోనూ తన అందం గురించి చిత్ర పరిశ్రమలో కామెంట్లు చేసేవారని తాప్సి గ‌తంలోకూడా వ్యాఖ్యానించింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు సినిమాలో అవకాశం ఇవ్వడానికి వెనుకాడేవారని అంత అందంగా లేవు అనేవారని తాప్సి చెప్పుకొని బాధపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -