- Advertisement -
బాలీవుడ్లో క్వీన్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాను అన్ని భాషలలోకి రీమేక్ చేయలని భావించారు.తెలుగులో తమన్నా హీరోయిన్గా దర్శకుడు నీలకంఠ క్వీన్ సినిమాను ప్రారంభించారు.అయితే ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి.అది నిజమే అని తెలుస్తుంది.హీరోయిన్ తమన్నాకు, దర్శకుడు నీలకంఠకు మధ్య గొడవ కారణంగా సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది.
ఈ గొడవలో నిర్మాత తమన్నాకు మద్దతు పలకడంతో ఈ సినిమా నుండి దర్శకుడు నీలకంఠ తప్పుకున్నారు.అయితే ఈ సినిమాకు మరో దర్శకుడిని తీసుకున్నారని తెలుస్తుంది.’అ!’ అనే సినిమా తీసిన ప్రశాంత్ వర్మను క్వీన్ సినిమాకు దర్శకుడిగా ఎంపిక చేశారు.అయితే ఈ సినిమా టైటిల్లో కూడా మార్పు చేశారని తెలుస్తుంది.సినిమా టైటిల్ను దటీజ్ మహాలక్ష్మి అనే పేరును ఖారారు చేశారు.