క్రికెట్ అభిమానలకు ఐపీఎల్ అంటే ఏదో తెలియని కిక్కు వస్తుంది.ఎందుకంటే సాధారణ టోర్నీల్లో ఆటగాళ్లు తమ దేశం తరపున మాత్రమే ఆడతారు. కానీ, ఐపీఎల్లో వివిధ దేశాల ఆటగాళ్లు ఒక జట్టుగా తమను కొనుగోలు చేసుకున్న ఫ్రాంచైజీ తరపున ఆడుతుంటారు. నేటి నుంచే ఈ టోర్నీ ఘనంగా ఆరంభం కాబోతోంది. ఐపీఎల్-11 తొలి మ్యాచ్ ప్రారంభం కావడానికి గంటన్నర ముందే ఆరంభోత్సవ సందడి మొదలవుతుంది. ఈ వేడుకలో హృతిక్ రోషన్, తమన్నా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు డ్యాన్స్ చేసి, అలరించనున్నారు.
ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియా నుండి ఓ హీరోయిన్ ఐపీఎల్లో డ్యాన్స్ ప్రోగ్రాంలో పోల్గొనుంది.ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్లో నార్త్ హీరో,హీరోయిన్లే తప్ప సౌత్ నుండి ఇంత వరకు హీరో కాని హీరోయిన్ కాని ఈ టోర్నీలో పోల్గొనలేదు.ఫస్ట్ టైమ్ హీరోయిన్ తమన్నా సౌత్ హీరోయిన్గా ఈ టోర్నీలో డ్యాన్స్ చేస్తుంది.ఈ సందర్భంగా తమన్నా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ‘నేను ఇంతకు ముందు ఎప్పుడూ క్రీడలకు సంబంధించిన వేడుకల్లో ప్రదర్శన ఇవ్వలేదు. ఇంత పెద్ద ఈవెంట్కు నన్ను సెలెక్ట్ చేసిన ఐపీఎల్ నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపింది తమన్నా.