- Advertisement -
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం తేజ్ ఐ లవ్ యు.ఇటీవల కాలంలో సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్,ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడు.ప్రేమ కథల స్పెషలిస్ట్ కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ఫస్ట్ లుక్లకు మంచి స్పందన వచ్చింది.అయితే ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను ఈ నెల( జూన్) 9న విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం.సినిమా జూన్ 29న రిలీజ్ కానుంది.