Monday, May 6, 2024
- Advertisement -

పవర్ స్టార్ అభిమానులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

- Advertisement -

మలయాళంలో ఘన విజయం అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్గా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా భీమ్లానాయక్ ఐదో ఆటకు అనుమతి ఇచ్చింది.

ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకు భీమ్లా నాయక్ సినిమాకు థియేటర్లలో ఐదో ఆట ప్రదర్శించుకోవచ్చంటూ జీవో విడుదల చేసింది. తెలంగాణ సర్కార్ నిర్ణయం పట్ల పవన్ కల్యాణ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో భీమ్లానాయక్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, మాటలు అందిచిన భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా నిత్యా మీనన్, సంయుక్తా మీనన్లు అలరించనున్నారు.

ఫిల్మ్ సిర్కిల్‌ గా చక్కర్లు కొడుతున్న క్రేజీ న్యూస్

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

నటీ నటులకు ఆనంద్ దేవరకొండ ఆహ్వానం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -