- Advertisement -
సాయి ధరం తేజ్ హీరోగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో తాజా తెరకెక్కుతున్న చిత్రం తిక్క. రోహిణి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన లారిస్సా బోనేసి, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ అసలు 20 తేదిన విడుదల చేయాలనీ అనుకున్నారు.
కానీ, అనివార్య కారణాలతో విడుదల కాకపోవడంతో, 21 తేదిన విడుదల చేశారు. యాక్షన్, కామెడీ, లవ్ కి సంబందించిన దృశ్యాలతో టీజర్ ను కట్ చేశారు. యూత్ ని, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఈ టీజర్ ఉన్నది. ఈ టీజర్ ద్వారా సినిమాపై అంచనాలు పెరిగేలా చేయాలని అనుకున్న టీమ్ ప్రయత్నం కొంతవరకు సక్సెస్ అయ్యింది. ఆగస్టు 13న ఈ సినిమాని విడుదల చేయాలనీ అనుకుంటున్నారు.
{youtube}v=4JZq5DZvkIY{/youtube}
Related