వంశీ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. రవితేజ సరసన నపూర్ సనన్ హీరోయిన్గా నటిస్తుండగా పాన్ ఇండియా సినిమాగా వస్తోంది. రవితేజ కెరీర్లో తొలిపాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.
ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ డేట్ని డీసైడ్ చేయాలని ఫ్యాన్స్కే ఆఫర్ ఇచ్చారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. ఓ రెండు డేట్స్ని ఇచ్చి ఏ డేట్ కి ట్రైలర్ కావాలి అనుకుంటున్నారు అని ట్విట్టర్లో పోస్టు చేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా సెప్టెంబర్ 27 నే ఎంచుకున్నారు. మరి ఫ్యాన్స్ ఓటు వేసిన డేట్కే టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.
ఇక ఇప్పటికే విడుదలైన టైగర్ దండయాత్ర గ్లింప్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. సెకండ్ హీరోయిన్గా గాయత్రి భరద్వాజ్ నటిస్తుండగా రవితేజ కెరీర్ లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతోంది ఈ చిత్రం. సినిమాటోగ్రఫీ ఆర్ మదీ ఐఎస్సి, సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు.