Sunday, May 19, 2024
- Advertisement -

రాష్ట్ర‌ప‌తి ఎవ‌రో తెలియ‌దు అని చెప్పిన హీరో

- Advertisement -

హీరో,హీరోలయిన్లు తెర మీదే చాలా తెలివిగా ఉన్న‌ట్టు ఉంటారు. కాని బయటి విషయాల్లో పరిజ్ఞానం కాస్త తక్కువేనని కొంద‌రిని చూస్తే తెలిసిపొతుంది.ఇప్పుడు ఈ లిస్ట్‌లో యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ కూడా చేరిపోయాడు. టైగర్‌ ష్రాఫ్‌ నటించిన భాఘీ-2 రిలీజ్‌ అయ్యి సూప‌ర్ హిట్‌తో దూసుకుపోతోంది.ఓ ఇంటర్వ్యూకు హీరో ,హీరోయిన్ దిశా పఠానీ కుడా హాజరయ్యారు.సినిమా విష‌యాల త‌రువాత కొన్ని జ‌న‌ర‌ల్ ప్ర‌శ్న‌లు కుడా అడిగారు స‌ద‌రు యాంక‌ర్‌.

ఆ ప్ర‌శ్నే…భారతదేశానికి రాష్ట్రపతి ఎవరు? అని టైగర్‌ను ప్రశ్నించింది. ఇది చాలా కష్టతరమైన ప్రశ్న అంటూ తటపటాయించిన టైగర్ మిస్టర్ ప్రణబ్‌ ముఖర్జీ అని పేర్కొన్నాడు. ఆ సమాధానానికి కంగుతిన్న యాంకర్ , మైక్‌ను దిశపఠానీ ముందు ఉంచేసరికి ఆవిడ ‘రామ్‌ నాథ్‌ కోవింద్‌’ అని చెప్పేసింది. ఈ విధాంగా మ‌రోసారి సోష‌ల్ మీడియాకు దొరికిపొయాడు టైగర్‌ ష్రాఫ్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -