Wednesday, April 17, 2024
- Advertisement -

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడు ఏం చేస్తోందంటే ?

- Advertisement -

శ్రీకాంత్ హీరోగా నటించిన ‘తాజ్ మహల్’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటూ సంఘవి. ఈమె అసలు పేరు కావ్వ. అమరావతి అనే తమిళ సినిమాలో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ’సింధూరం’ సినిమాలో అమాయకపు అమ్మాయిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ‘సీతారామరాజు’ ‘ఆహ’ ‘సూర్య వంశం’ ‘మృగరాజు’ ‘సమరసింహారెడ్డి’ ‘గొప్పింటి అల్లుడు’ ‘ప్రేయసి రావే’ ‘సందడే సందడి’ ‘రవన్న’ ‘శివయ్య’ ‘తాతా మనవడు’ ఇలా నలబైదాకా తెలుగు చిత్రాల్లో నటించింది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాధించుకుంది. తెలుగులో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ రవితేజ ఎన్టీఆర్ రాజశేఖర్ శ్రీకాంత్ వంటి హీరోల సరసన నటించి తెలుగమ్మాయే అనుకునేంతలా టాలీవుడ్ లో పాతుకుపోయింది. 2004లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆంధ్రావాలా’ సినిమాలో నటించిన సంఘవి ఆ తర్వాత ‘ఒక్కడే కానీ ఇద్దరు’ అనే తెలుగు సినిమాలో స్పెషల్ రోల్ చేసినది. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. కానీ కొన్ని కన్నడ తమిళ చిత్రాల్లో మాత్రం నటించింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన సంఘవి మెల్ల మెల్లగా సినిమాలకు దూరమవుతూ వచ్చింది.

39 ఏళ్ళ వయసులో 2016లో వెంకటేశ్ అనే ఐటీ సంస్థ యజమానిని సంఘవి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ షోకి కొన్ని ఎపిసోడ్స్ కి జడ్జ్ గా వచ్చి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే సంఘవి ఇప్పుడు ఒక పాపకి జన్మనిచ్చింది. తన బిడ్డతో కలిసి సంఘవి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. సంఘవి ఈ ఫోటోలో తన బిడ్డని ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉంది. సంఘవి ప్రస్తుత వయసు 42 ఏళ్ళు. ఈ వయసులో ఆమె తల్లికావడం కాస్త ఆశ్చర్యం అనిపించిన ఫ్యాన్స్ మాత్రం ఆనందంగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -