Wednesday, May 15, 2024
- Advertisement -

హీరో రాజ్ త‌రుణ్ వైసీపీ త‌రుపున ప్ర‌చారం చేయ‌నున్నారా..?

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది పార్టీలు మారే నేత‌లు ఎక్కువ అవుతున్నారు. ప్ర‌తిప‌క్ష పార్టీలో వైసీపీలోకి భారీగా వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా వైసీపీ పార్టీలో చేరుతున్నారు. క‌మెడియ‌న్ అలీ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా న‌టుడు రాజా ర‌వీంద్ర బుధ‌వారం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ పార్టీలో చేరారు. నేను కేవ‌లం జ‌గ‌న్‌గారి మీద అభిమానంతోనే పార్టీలో చేరాన‌ని , టికెట్ అడ‌గ‌లేద‌ని చెప్పారు రాజా ర‌వీంద్ర.

వైసీపీ త‌రుపున ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తాన‌ని చెప్పుకొచ్చారు రాజా ర‌వీంద్ర‌. అయితే హీరో రాజ్ తరుణ్ కూడా వైసీపీ పార్టీ త‌రుపున ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. హీరో రాజ్ త‌రుణ్‌కు పీఆర్ఓగా ప‌ని చేస్తున్నాడు రాజా ర‌వీంద్ర. ఇప్పుడు రాజా ర‌వీంద్ర వైసీపీలో చేర‌డంతో రాజ్ త‌రుణ్ కూడా వైసీపీలో చేరి పార్టీ త‌రుపున ప్ర‌చారం చేయ‌నున్నార‌నే ఓ రూమ‌ర్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇక వైసీపీలో చేరిన అనంతరం రాజా ర‌వీంద్ర మీడియాతో మాట్లాడుతు.. ప్రత్యేక హోదా రావాలంటే వైసీపీ అధికారంలోకి రావాల్సివుందని రాజారవీంద్ర అభిప్రాయపడ్డారు. జ‌గ‌న్ ఎటువంటి బాధ్య‌తలు అప్ప‌గించిన స్వీకరిస్తానని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -